విజయవాడ ఫిబ్రవరి 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనవరి 20వ తేదీన ఉదయం 10.00 గంటలకు శాప్ వైస్ చైర్మన్ & మేనే జింగ్ డైరెక్టర్ ఎస్. భరణి, I.F.S., దక్షిణ అమెరికాలో ని అత్యున్నత శిఖరం మౌంట్ అకోంకాగ్వా (6,962 మీటర్లు)ను విజ యవంతంగా అధిరోహించి అరుదైన ఘనతను సాధిం చారు. ఈ సందర్భంగా రోజు ఫిబ్రవరి 2 విజయ వాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ రవి నాయుడు భరణిని ఘనంగా సత్కరిం చి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అత్యంత క్లిష్టమైన వాతావ రణ పరిస్థితులు, తీవ్రమైన చలిని ఎదుర్కొంటూ ఆమె ఈ విజయాన్ని సాధించడం అపూర్వమని ఆయన ప్రశంసించారు. అలాగే భరణి ఈ ఘన విజయం కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, మహి ళలకు, యువతకు, ముఖ్యంగా క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంద అందుబాటులో ని ఆయన పేర్కొన్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యా న్నైనా సాధించవచ్చని ఆమె తన విజయంతో నిరూపించార ని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు, తదితరులు పాల్గొన్నారు


