యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపాలిటీ 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణాధ్యక్షుడుఎండి బాబా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు , గృహ జ్యోతి ,లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఎండి.బాబా తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు మంజూరు చేసిందని అన్నారు. గోదావరి జనాల ద్వారా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికె దక్కిందని ఎండి బాబా అన్నారు.

