కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన్నెం నాగిరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు లో మంగళవారం అద్దంకి నాంచారమ్మ కల్యాణ మండపం లో జరిగిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో గోపుత్ర ఉత్తమ రైతు పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ చైర్మన్ పెండెగంటి విజయ్ కుమార్ ఐ ఏ ఎస్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు రంజాన్ రమేష్, కుడుముల వెంకటరామి రెడ్డి, టి. నాగరాజు, డాక్టర్ చల్ల నాగేశ్వరావు, బీ ఆర్ సోమ శేఖర్ రెడ్డి, కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య పాల్గొన్నారు.

