Breaking News

పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

  • నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్

కరీంనగర్ : పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈరోజు నగరంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రెసిడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్లకు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు సంపత్, అమరేంధర్ లు 11న జరగబోయే పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధుల పట్ల వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పిఓలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించాలన్నారు. మొదటగా పోలింగ్ అధికారి ప్రతి ఓటర్ ను ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఓరిజినల్ గుర్తింపు కార్డుతో మాత్రమే ఓటుకు అనుమతించాలన్నారు. ఏజెట్ల అనుమతితోనే ఓటు వేయడానికి ఓటర్ ను అనుమతించాలన్నారు. ఓటర్ కు ఇంకు అప్లై చేసిన తర్వాతే బ్యాలెట్ పేపర్ ను ప్రొసిజర్ ప్రకారం మడిచి ఇచ్చి ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఇబ్బందులు రాకుండా పివోలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీస్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసీ ఖాధర్ మొహియుద్దీన్, మాస్టర్ ట్రైనర్లు అమరేంధర్, సంపత్, పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *