Breaking News

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా జేఎస్ఆర్

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్)ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని తన కార్యాలయంలో సోమవారం వెంకట సాంబశివరావుకు జగ్గారపు నియామక పత్రాన్ని అందజేశారు. జేఎస్ఆర్ ప్రస్తుతం అమరావతి టైలర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా భవాని చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు, మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా జేఎస్ఆర్ మాట్లాడుతూ జిల్లాలో సంఘం ను గ్రామస్థాయి వరకు బలోపేతం చేసి, సంఘం అభివృద్ధి కృషి చేస్తామన్నారు. జిల్లా లో పద్మశాలీల సమస్యలపై పోరాడి చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. జేఎస్ఆర్ ను సంఘం మాజీ అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు, పద్మశాలియ నాయకులు మునగాల నాగేశ్వరావు, బుద్దంటి రవి కిరణ్, కొల్లి బాబురావు, నందం యశోద బాబు తదితరులు అభినందించారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *