మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని మంగళగిరి పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు బుద్దంటి రవి కిరణ్ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై సోమవారం ఆయన ఇలా స్పందించారు. కేంద్ర బడ్జెట్ భారతదేశ అభివృద్ధికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా ఉందన్నారు. 53,47,315 కోట్లతో మంత్రి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. డిఫెన్స్ కు 7,84,678 కోట్లు, రోడ్లు హైవే లకు 3,09,875 కోట్లు, రైల్వేలకు 2,81,37 కోట్లు కేటాయించి మంచి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రక్షణ రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందని, భవిష్యత్తులో ప్రధానమంత్రి మోడీ సారధ్యంలో భారతదేశం మొదటి స్థానంలోకి వస్తుందన్నారు.

