నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపుల్లో ఎం.ఆర్.పి కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మటం పై ఫిర్యాదులు రావడంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం అని, దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని ఆయన హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతర నిఘా పెట్టి, నియమ ఉల్లంఘనకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఫిర్యాదులు కాకినాడతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి అందుతున్నట్లు వెల్లడైంది.

