నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆన్లైన్ సేవతో ప్రజలకు సౌకర్యం అందిస్తోంది. “డిజీ రైతు బజార్” యాప్ & వెబ్సైట్ ద్వారా స్థానిక రైతుల బజార్లలోని తాజా కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే నేరుగా ఇంటికి డెలివరీ చేయవచ్చు.ప్రస్తుతం విశాఖపట్నంలోని కొన్ని రైతు బజార్లకు పరిధిలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఈ సేవ, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రజలు యాప్లో రిజిస్టర్ అవ్వడం, సరుకులను సెలెక్ట్ చేయడం, ఆన్లైన్ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయడం ద్వారా కొన్ని నిమిషాల్లోనే ఇంటికే సరుకులు పొందవచ్చు.ప్రైవేట్ క్విక్ కామర్స్ యాప్స్తో పోలిస్తే, ఈ కొత్త ప్రభుత్వ యాప్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు అందుతాయి.
యాప్ వాడే విధానం:
- డిజీ రైతు బజార్ యాప్/వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. –https://digirythubazaarap.com
- లాగిన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇచ్చి దగ్గరలోని రైతు బజార్లు చూడండి.
- కావాల్సిన సరుకులను సెలెక్ట్ చేసి కార్ట్లో యాడ్ చేయండి.
- అడ్రస్ & పేమెంట్ ఆప్షన్స్ ఎంచుకుని ఆర్డర్ పూర్తి చేయండి.
- కొన్ని నిమిషాల్లోనే ఇంటికే డెలివరీ.

