యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి.బసంతాపూరం గ్రామానికి చెందిన రైతు కట్కూరి రమేష్ కు చెందిన లేగ దూడగా గుర్తింపు.గత నెల రోజుల నుండి రాజాపేట తుర్కపల్లి మండలాల్లో సంచరిస్తూ లేగ దూడలు ఆవుల పై దాడి చేస్తూ తప్పించుకు తిరుగుతు ఫారెస్ట్ ఆఫీసర్లకు సవాల్ మారిన పులి దాడులు.భయం భయం గా ప్రాణాలు అర చేతి లో పెట్టుకుని గడుపుతున్న రాజాపేట. తుర్కపల్లి మండలాల ప్రజలు రైతులు.ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లేగ దూడల ప్రాణాలు కోల్పోతున్నా మంటున్న రైతులు.

