Breaking News

బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

కోదాడ, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ దుండగులు బీఆర్ఎస్ పార్టీ 11 వార్డు అభ్యర్థి దొడ్డిగొర్ల ప్రసాద్‌ను కిడ్నాప్ చేశారు.ఈ ఘటనపై స్పందించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , కోదాడ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి బూడిద భిక్షమయ్య గౌడ్ తో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తూ ఎన్నికల సమయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని ఆయన పేర్కొన్నారు.కిడ్నాప్‌కు గురైన బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డిగొర్ల ప్రసాద్ ను వెంటనే సురక్షితంగా విడిపించి తమకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికల స్వేచ్ఛను హరించే ఈ తరహా చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *