Breaking News

షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన

నడిగూడెం ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక ): ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు నడిగూడెం ఎస్ ఐ అజయ్ కుమార్ మండల కేంద్రం లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

ఏ ఎస్ ఐ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే కోదాడ షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి. విద్యార్థినిలు అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను గురువులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వేధించినట్లయితే షీ టీం కి సమాచారం ఇవ్వండి. మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపిలుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని, “ఫ్రాడ్ కా పుల్ స్టాప్” కార్యక్రమంలో భాగంగా తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు.

అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ గురుకుల ఇంచార్జి ప్రిన్సిపల్ విజయశ్రీ,పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ నరేష్, శ్రీను, కళ్యాణ్ కళాబృందం ఇంచార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి,కృష్ణ,సత్యం, విద్యార్థినిలు కళాశాల, పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *