యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ కార్యదర్శి 11వ వార్డుకు చెందిన బందెల విష్ణుమూర్తి బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే శ్రీ పడాల శ్రీనివాస్ గారి సమక్షంలో మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారితోపాటు బందెల పద్మ, మంద సునీత లక్ష్మి, శ్రావణి చేరారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు బిజెపి అభ్యర్థి బందెల సుభాష్, పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కామిటీకారి కృష్ణ, కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, ప్రధాన కార్యదర్శి సృజన్ కుమార్, సీనియర్ నాయకులు పాశికంటి సోమయ్య, పంపరి లక్ష్మీనారాయణ, బడుగు జాంగిర్, పాశికంటి సంపత్, బోడపట్ల నిర్మల, రాజు తదితరులు పాల్గొన్నారు.

