కరీంనగర్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ -IJU) ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర డైరీని మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలకపాత్ర వహిస్తుందని సమాజ హితానికి జర్నలిస్టులు నిబద్ధత తో పనిచేయాలని సూచించారు. జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుత పాత్రను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడు మీడియాకు సహకరిస్తుందని, శాంతి భద్రత పరిరక్షణలో జర్నలిస్టుల సహకారం అవసరమని అన్నారు. మంచి సమాచారంతో మీడియా డైరీని ముద్రించిన టియుడబ్ల్యూజే నాయకులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకటేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఊరడి రవీందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలిగేటి శ్రీనివాస్,కంకణాల రఘు,రేగుల నర్సింగం జి కేశవరెడ్డి,ఎండీ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

