మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుపతి లడ్డు పైఅనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై, అక్రమంగా వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు కట్టిన వారిపై, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దౌర్జన్యం చేసిన వారిపైకేసులు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు
వేమారెడ్డి కామెంట్స్..
రాష్ట్రంలో 40 సంవత్సరాలు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి పరిపాలన లో ఇలాంటి దాడులు జరగటం అన్యాయం.భావితరాలకు మంచి సందేశం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇలాంటి దాడులు చేయించడం అన్యాయం..తక్షణమే అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

