Breaking News

ప్రజాస్వామ్య స్ఫూర్తికే ‘ఏకగ్రీవం’ గొడ్డలిపెట్టు

కోదాడ, ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక: ఎన్నికల్లో ఏకగ్రీవం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు చెప్పారు. కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడి పోటీలో ఉన్న ఇతర పార్టీల, స్వతంత్ర అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నదని వస్తున్న ఆరోపణల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అధికార పార్టీనే తుంగలో తొక్కినట్లుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తక్షణమే అప్రజాస్వామిక పార్టీ ఫిరాయింపులను, నియంతృత్వ విధానాలను మానుకోకపోతే భవిష్యత్తులో ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *