మంగళగిరి ఫిబ్రవరి 02, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్గా తోట శివరామ ప్రసాద్ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న నిబద్ధత, చేనేత కార్మికుల సమస్యలపై ఆయనకున్న అవగాహనను గుర్తించిన బిసివై పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు. ఈ నియామకం పట్ల శివరామ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత శ్రీ రామచంద్రయాదవ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల గొంతుకగా నిలుస్తానని ఆయన తెలిపారు.

