Breaking News

కాజ గ్రామంలో చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేత

లోకేష్ సహకారంతో ఇద్దరికి మిషన్లు అందజేసిన నాయకులు.

మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

మంగళగిరి, ఫిబ్రవరి 02, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఇద్దరు చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేశారు. టీడీపీ నాయకులు మంగళవారం కాజ గ్రామంలో లబ్ధిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేశారు. వెల్డింగ్ మిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి మంత్రి నారా లోకేష్ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు చేస్తూ అండగా ఉంటున్నారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గాదె పిచ్చి రెడ్డి, గుంటూరు ఛానల్ 2 చైర్మన్ మాణిక్యాల రవి, మండల కార్యదర్శి చింకా కోటేశ్వరరావు రావు, కాజ గ్రామ ఉపాధ్యక్షులు పోతురాజు శ్రీనివాసరావు, మాణిక్యాల గోపి, పల్లబోతుల సాయి కృష్ణ, బొప్ప వాసవి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *