Breaking News

మంత్రి సవితకు టైలర్స్ డే ఆహ్వానం

మంగళగిరి, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి ఈద్గాలో ఈనెల 28వ తేదీన అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే టైలర్స్ డే వేడుకలకు హాజరుకావాలని అసోసియేషన్ నాయకులు తాడేపల్లిలో మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత ను కలసి ఆహ్వానించారు. తాడేపల్లి జయభేరి అపార్ట్మెంట్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అసోసియేషన్ నాయకులు మంత్రిని కలసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ నాగుల మీరా, జంజనం వెంకట సాంబశివరావు, అసోసియేషన్ నాయకులు నల్లమోలు సుబ్రహ్మణ్యం, చాదరాసుపల్లి భాస్కర్, బాపనపల్లి అంజయ్య, తిరువీధుల సాంబశివరావు, షేక్ రజాక్, మహమ్మద్ అజీమ్, బీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *