మంగళగిరి, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తాడేపల్లి జయభేరి అపార్ట్మెంట్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత క్యాంప్ కార్యాలయంలో మంగళవారం టైలర్స్ డే వేడుకలకు ఆహ్వానించడానికి వెళ్లిన సందర్భంగా నూతనంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జంజనం వెంకట సాంబశివరావును మంత్రి సవిత శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్లు జేఎస్ఆర్ చెప్పారు.

