కోదాడ, ఫిబ్రవరి03 ( నేటి తెలుగు పత్రిక ): మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బు మద్యం పంపిణీ చేసే అభ్యర్థులను ఓడించి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు.మంగళారం స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సిపిఎం పార్టీ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన అన్నారు సిపిఎం పోటీ చేసిన 8 9 12 వార్డుల అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సిపిఎం గత కొన్ని సంవత్సరాల నుంచి కోదాడ పట్టణ అభివృద్ధి కోసం పేద ప్రజల హక్కుల కోసం రెండు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు అంతర్గత రోడ్లు మురికి కాలు నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేసిన చరిత్ర ఈ పట్టణంలో సిపిఎం పార్టీకి ఉందని వారు గుర్తు చేశారు
ఈ యొక్క సమావేశం కుక్కడపు నళిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు సిపిఎం పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ సత్యనారాయణ బెల్లంకొండ వెంకటేశ్వర్లు పట్టణ కమిటీ సభ్యులు కర్ణ కోటి నవీన్ నారదాసు శ్రీను నక్క గోపి దాసరి శ్రీను ఎస్.కె రహిమాన్ మరియన్న వెలిది పద్మావతి జంగపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

