పులి సంచారం పై కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసిన బీర్ల అయిలయ్య.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల పులి సంచారం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు స్పందించారు. ఈ విషయంపై ఆయన జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారితోఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.పులి సంచారం వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే అయిలయ్య, వెంటనే అటవీ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. పులి దాడులను కట్టడి చేసేందుకు తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఈ ప్రాంత రైతులు మరియు ప్రజల పశువుల రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అయిలయ్య స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

