బోనీ కొట్టిన కాంగ్రెస్! మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం!
కోదాడ, ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక: కోదాడ మున్సిపల్ 11,21,31వార్డులలో పోటీలో ఉన్నవారు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం తో ఎన్నిక లేకుండా ఏకగ్రీవం అయింది.ఏకగ్రీవానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి, వార్డు నాయకుల కు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్నేని వెంకటరత్నం (బాబు ), దేవరపల్లి మల్లేశ్వరి, కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవం తో కోదాడ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ మూడు స్థానాలు బోణీ చేసింది. మిగిలిన 32 స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ పక్షాన, స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేశారు. గత మూడు రోజులుగా వార్డులో అభ్యర్థుల గెలుపులకై ముమ్మర ప్రచారం నిర్వహించారు. నామినేషన్ ల ఉపసంహరణ లో ముగ్గురు పై పోటీలో ఉన్న వారు తమ నామినేషన్ ను ఉపసంహరించు కోవడం తో ఏక గ్రీవం గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎర్నేనికుసుమ, దేవరపల్లి మల్లేశ్వరి, కట్టబోయిన జ్యోతి లు , మాట్లాడుతూ తన ఏకగ్రీవం కు సహకరించిన మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లకు, పోటీ నుండి ఉప సంహరించుకున్న అభ్యర్థులకు స్థానిక నాయకులకు పేరు ,పేరున కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఏక గ్రీవం గా ఎన్నికైన ముగ్గురు కౌన్సిలర్లకు,స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచి అభినందనలు తెలిపారు.




