నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కెరీర్ మంచి దశలో ఉండగానే మెగా హీరో వరణ్ తేజ్ను వివాహం చేసుకున్న లావణ్యకు, ఈ మధ్యే వాయువ్ అనే కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం తీసుకున్న ఆమె.. తాజా ట్వీట్తో చర్చనీయాంశంగా మారింది.ఇటీవల మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి కవలలు – బాబు, పాప జన్మించడంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.అయితే ఈ సంతోషకర సమయంలోనూ కొందరు నెటిజన్స్ గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిరిగి బయటకు తీసి ట్రోలింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆనంద సందర్భాన్ని పక్కదారి పట్టిస్తూ ఇష్టానుసారంగా విమర్శలు చేయడంపై లావణ్య త్రిపాఠి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఆనంద క్షణాలను అసహ్యంగా మార్చొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుటుంబసభ్యుల సంతోషాన్ని గౌరవించాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు అభిమానుల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది.

