విజయవాడ, ఫిబ్రవరి 4 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నగర పాలక సంస్థ డైరీను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ చేతుల మీదు గా డైరీని ఆవిష్కరించారు. ఈ మేరకు రాయన భాగ్య లక్ష్మీ మాట్లాడుతూ ఈ డైరీ మున్సిపల్ కార్పొరేషన్ సేవలన్నింటినీ సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రూపొందించబ డిందని, నగరవాసులకు ఉపయోగపడే అన్ని ము ఖ్యమైన సమాచారాన్ని ఇందులో పొందుపరిచారని తెలిపారు. VMC డైరీ ద్వారా ప్రజలకు మున్సిప ల్ సర్వీసుల గురించి పూర్తి సమాచారం అందించారని, శుభ్రత, మౌలిక వసతులు, ఆరోగ్య, మరియు పర్యావ రణ పరిరక్షణ వంటి అంశా లపై అవగాహన పెంచేందు కు ఇది ఉపయోగపడు తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, ఎకౌంట్స్ ఎగ్జామినర్ చక్రవర్తి, అకౌం ట్స్ ఆఫీసర్ బి. సత్యనారా యణమూర్తి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, తదితరు లు పాల్గొన్నారు.

