కాంగ్రెస్ అభ్యర్థి చింతలషణి సునీత శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు గౌరవ శ్రీ బీర్ల ఐలయ్య గారు ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చింతలషణి సునీత శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగినది. ఐలన్న ప్రచార కార్యక్రమానికి ఆలేరు ఒకటో వార్డు ప్రజల నుండి భారీ స్పందన రావడం జరిగినది. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చేయి గుర్తుపై ఓటు వేసి సునీత శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగినది. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగినది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి. డిసిసి మాజీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి. నీలం పద్మా వెంకటస్వామి. టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్. మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు. మాజీ ఎంపీపీ అశోక్. కట్ట గుమ్ముల విద్యాసాగర్ రెడ్డి. ఎక్స్ ఎంపీటీసీ ప్రశాంత్. మొదలగువారు పాల్గొన్నారు.

