Breaking News

అరటి సాగులో ఆధునిక సాంకేతికతపై అవగాహన

పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అరటి సాగులో ఆధునిక సాంకేతికతలపై ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ, శిరీష, మౌనిక, ఉద్యాన అధికారి రాఘవేంద్రారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధునిక అరటి సాగు పద్ధతులు, పంటల ఉత్పత్తి పెంపు మార్గాలు, రోగ నివారణ చర్యలు, ప్రభుత్వ పథకాలపై విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆర్ హెచ్ డబ్ల్యు ఈ పి విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ వ్యవసాయము, వర్టికల్ గార్డెనింగ్, ఆధునిక వ్యవసాయ అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే ఈ రైతు సదస్సు రైతులు విద్యార్థులు శాస్త్రవేత్తల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.

ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం: డాక్టర్ సుకన్య

ఏపీ సూపర్ కప్ 2026 గెలుచుకున్న సిటాడెల్ గోదావరి లెజెండ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *