తిరువూరు ఫిబ్రవరి 5 ( నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగింపుపై పోలీసు డిపార్ట్మెంట్ సహయంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ అధికారులుపట్టణంలో వ్యాపారస్తులు ఫుట్ పాత్ అక్రమంచి వ్యాపారాలు చేయటం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగింపుకు పోలీసు శాఖ సహాయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ శాఖాధికారులు.పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ నుండి చీరాల సెంటర్ వరకు ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగించి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చుతామనిఎస్ఐ శాతకర్ణి,టౌన్ ప్లానింగ్ అధికారి నాగ మలేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
