పులివెందుల నేటి తెలుగు పత్రిక : అనునిత్యం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ కు జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో మొదటి ఓటు వేయాలని పులివెందుల కోర్టు ఆవరణంలో ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు సి సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ మారుతి రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతున్న అభ్యర్థి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ IAL రాష్ట్ర అధ్యక్షులు చలసానిఅజయ్ కుమార్ బ్యాలెట్ పేపర్ నందు వరుస సంఖ్య నాలుగు ఉంటుందని దానికి ఎదురుగా ONE గా రాయాలని వారు తెలిపారు న్యాయవాదులకు ఇళ్ల స్థలాల కోసం జూనియర్ న్యాయవాదులకు స్టైపండు పెంచాలని పోరాటాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు ,పులివెందుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తులసిరామ్, ఐ ఏ ఎల్ జిల్లా నాయకులు వెంకటరమణ, సుశీల్ కుమార్, పులివెందుల న్యాయవాదులు హరినాథ్ రెడ్డి, కే నరసింహారెడ్డి ,ప్రకాష్, రామ్మోహన్ ,తదితరులు పాల్గొన్నారు.

