ది రాజాసాబ్తో సహా 15కి పైగా సినిమాలు స్ట్రీమింగ్లోకి..
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్ను ప్రారంభించగా… తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ కూడా డిజిటల్లోకి ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం (ఫిబ్రవరి 06) అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా వంటి చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వీటిలో బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ నటించిన సుమతీ శతకం, గుణ శేఖర్ దర్శకత్వంలోని యూఫోరియా సినిమాలపై కొంత పాజిటివ్ టాక్ నడుస్తోంది.థియేటర్లతో పోలిస్తే ఈ వారం ఓటీటీల్లో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంది. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ప్రస్తుతం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మోస్తరు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ఆసక్తికరంగా మారింది.ది రాజాసాబ్ ఒక్కటే కాదు… ఈ వారం తెలుగు, డబ్బింగ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ఫాంలలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీల్లో 15కి పైగా సినిమాలు డిజిటల్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.
