కోదాడ , ఫిబ్రవరి6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె కోదాడ లో,వార్డుల వారీగా, అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొని మాట్లాడారు. ఏకగ్రీవమైన మూడు వార్డులు ఫోను, మిగిలిన 32 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని, కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని ఆమె అన్నారు. ప్రచార కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పారా సీతయ్య, గుండపనేని నాగేశ్వరరావు, తోట శీను, పారా వెంకటేశ్వర్లు, చింతలపాటి శ్రీనివాసరావు, రామిశెట్టి హరి, రామిని శ్రీనివాసరావు, ఉప్పగండ్ల శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

