యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్ గారితో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రాగి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
