Breaking News

విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం: ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ అన్నారు. వేంపల్లి లో శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం వల్ల మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అలాగే మంచి విటమిన్స్ తో కూడిన బెల్లం, రాగి జావా చిక్కి తదితర వాటితో విద్యార్థులకు పో షకహరము లభిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి సన్నబియాన్ని ఇవ్వాలని ఆలోచన చేశామని అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనము లో మంచి మెనూ ఇవ్వడం హర్షనేయమన్నారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనం రుచి కూడా చూశారు. ఇంత పెద్ద హైస్కూల్లో 900 మందికి రుచికరంగా భోజనం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదని వారు తెలిపారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు నాగాంజనేయులు, ఎంఈఓ 1 వెంకటరామిరెడ్డి, ఉపాధ్యాయులు చెరుకూ రు శ్రీనివాస్, ఆవుల వెంకట్, బాబా ఫక్రుద్దీన్, ఓబులపతి మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాధితురాలకి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది…!

మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *