కోదాడ, ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్లో పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీని ప్రజలందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మున్సిపాలిటీలో ప్రాతినిత్యం ఉంటే పట్టణ సమగ్ర అభివృద్ధికై ప్రజల ప్రక్షాళ నిలబడి పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో బూర్జ పార్టీలు డబ్బు మద్యాన్ని ఆశ సూపి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నాయనీ, అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిస్వార్ధంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నిమ్మాది వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు వార్డ్ అభ్యర్థిలు ఎం ముత్యాలు, కుక్క డప్పు నళిని ,నక్క కుమారీ, సిపిఎం నాయకులు రాపోలు సూర్యనారాయణ ,దేవర వెంకటరెడ్డి ,వెళ్లిది పద్మావతి ,కాసాని కిషోర్ , నక్క నవీన్, జంగపల్లి శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
