విజయవాడ, 6-02-2026, నేటి తెలుగు పత్రిక: ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీమతి ఉమా దేవి గారిని నియమించామని, ఈ సందర్భంగా ప్రగతి నారి శక్తి నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఉమా దేవి గారు మహిళల జీవనోపాధి అవకాశాల విస్తరణ, మహిళల చేతి వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలను చైతన్యపరచడంలో విశేష అనుభవం కలిగిన సమర్థవంతమైన ట్రైనర్గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.అలాగే, ఉమా దేవి గారు ఇప్పటికే వివిధ సామాజిక, రాజకీయ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
ఆమె నిర్వహిస్తున్న బాధ్యతలు:-
1)నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ – రాష్ట్ర కన్వీనర్
2)రైతు మహాజన ఫ్రంట్ – సభ్యురాలు..
మహిళా శక్తిని సంఘటితం చేయడంలో, స్వయం ఉపాధి దిశగా మహిళలను నడిపించడంలో ఉమా దేవి గారి పాత్ర మరింత కీలకంగా ఉంటుందని, ప్రగతి నారి శక్తి సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
