పెద్దవడ్లపూడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
మంత్రి నారా లోకేష్ చొరవతో 7 మంది లబ్ధిదారులకు రూ.9.75 లక్షల ఆర్థిక భరోసా.
మంగళగిరి ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పెద్దవడ్లపూడి గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. వైద్య చికిత్సలు, ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆలమూరి విజయ్ కుమార్కు రూ.3,26,445/-, భావన సుధారాణికి రూ.2,86,735/-, కూరపాటి ప్రమీల కు రూ.1,62,000/-, జవ్వాది రత్నజలికి రూ.72,419/-, చల్లపల్లి గంగాధర్ రావుకు రూ.53,047/-, నెప్పల్లి శ్రీకాంత్కు రూ.40,350/-, అన్నే నాగేశ్వరరావుకు రూ.35,000/- చొప్పున చెక్కులు అందజేయగా, మొత్తంగా రూ.9,75,996/- (తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు) విలువైన ఆర్థిక సహాయం పంపిణీ చేయడం జరిగింది.సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఈ ఆర్థిక సహాయం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అందజేసినవారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, యేళ్ళ శివరామయ్య,మాదల రమేష్ బాబు, మొద్దుకూరి రమేష్ బాబు, నడపన దుర్గారావు, యేళ్ళ మల్లయ్య,యేళ్ళ నవీన్, కొప్పాక ఓంకార్, నున్నం గోపి , సుకవాసి కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు.
