యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ ఇటీవల యాదగిరిగుట్టలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ వారి ఆత్మీయ మిత్రులైన వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలను తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
