విజయవాడ, నేటి తెలుగు పత్రిక: బీసీల కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని వెల్లడించారు. బీసీల కుల గణన చేపట్టాలని ఫిబ్రవరి 28న విజయవాడలోని ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షులు వీజీఆర్ నారగోని ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కన్వీనర్ వేల్పూరి శ్రీనివాసరావు, అధ్యక్షులు అనుమోలు విజయకుమార్, మహిళా అధ్యక్షురాలు పొట్లూరి దేవి, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కోఆర్డినేటర్ జై బాబు, తదితరులు పాల్గొని మాట్లాడుతూ కులగణన జరిగితేనే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కులగననా చేపట్టాలన్నారు. కులగణన చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి మొదటి వారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28న విజయవాడ ధర్నా చౌక్ లో కులగణన చేపట్టాలని మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీలు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల మద్దతు ఉంటుందని చెప్పారు.

