యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి డబుల్ సీసీ రోడ్డు పనులలో భాగంగా రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ ఎయిర్ వాల్స్ తొలగించి పక్కకు అమర్చాలని కోరుతూ ఆత్మకూరు గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ మిషన్ భగీరథ ఇ.ఇ కరుణాకర్, గారిని జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేసి పనులు వీలైనంత తొందరలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్, ఏ .ఈసుమిత్,కోరే మధు పాల్గొన్నారు.
