బెల్లంపల్లి, ఫిబ్రవరి 9: (నేటి తెలుగు పత్రిక): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 3, 17, 18 వార్డుల అభ్యర్థులు పోరండ్ల సత్యవతి, రాగం శెట్టి సతీష్, తస్లీనా సుల్తానా బేగం లను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
