కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో టిఆర్ఎస్ నాయకులు,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని వారికి మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హయాంలో అభివృద్ధి చెందిందని,, అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని, అమలు గాని వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ను మట్టి కనిపించాలని, ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఘన విజయం సాధింపజేయాలని మల్ల యాదవ్ కోరారు. పట్టణంలో వార్డుల వారీగా ఇంటింటా ప్రచారం ర్యాలీలు కొనసాగాయి.
