కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన పురపాలక సంఘము పరిధిలోని పలువార్డులలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట పాల్గొన్న స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డి,మాజీ శాసనసభ్యులు వెనెపల్లి చందర్ రావు, డిసిసిబి మాజీ చైర్మన్ పాండురంగారావు,సీనియర్ కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి _ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పురపాలక సంఘం ఎన్నికలలో క్లిన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని స్థానిక సంస్థలలో అధికార పార్టీకి అనువైన వాతావరణం ఏర్పడడం అరుదైన అంశం అని ప్రస్తుత పురపాలక సంఘము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడిందనీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకుప్రజామోదం లభించిందనీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులౌతున్నారనీ జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు స్వాగతిస్తున్నారనీ సన్నబియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు ప్రజా క్షేత్రంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయనీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాను పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయనీ కాంగ్రెస్ ప్రభుత్వం పనీతీరు పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ,నిరుద్యోగ యువతీ యువకులు సంతృప్తితో ఉన్నారనీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.
