విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఈ నెల పంజాబ్ రాష్ట్రం లూథియానాలో ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు నిర్వహించిన 2వ ఏషియన్ జూని యర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపి యన్షిప్, 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారు లు అద్భుత విజయాలు సాధించారు. ఈ పోటీల్లో ఏ.ఎస్.వైశాలి అండర్–15 గర్ల్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, పీవీ చిన్హాస్ అండర్–15 బాయ్స్ డబు ల్స్ విభాగంలో కాంస్య పతకం మరియు ఎం. రేవంత్ అండర్ 18 బాయ్స్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి రాష్ట్రా నికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రధాన కార్యాలయంలో సోమవారం శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడుని క్రీడాకారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి నాయుడు క్రీడాకారు లను శాలువాతో సత్కరించి, వారి విజయాలను ప్రశంసిస్తూ రానున్న రోజు ల్లో అంతర్జాతీయ స్థాయి లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ దారం నవీన్ కుమార్, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
