విజయవాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు దినపత్రిక ): లిస్టింగ్ విధానక్రమాన్ని పర్యవేక్షించి, నడిపించడానికిగానూ ప్రత్యేంగా ఐపిఒ కమిటీని తిరిగి నియమించడం ద్వారా ఎన్ఎస్ఇ తన ఐపిఒ పాలనా చట్రాన్ని బలోపేతం చేసింది. టాబ్లేష్ పాండే . ఛైర్ పర్సన్ (నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్), శ్రీనివాస్ ఇంజెటి – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్),ప్రొఫెసర్ (డా.) మమతా బిస్వాల్ – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్),జస్టిస్ (రిటైర్డ్) . అభిలాష కుమారి – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్), ప్రొఫెసర్. జి. శివకుమార్ – సభ్యులు (పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్), ఆశీష్కుమార్ చౌహాన్ – సభ్యులు (మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ),లుగా నియామకాలు జరిగాయి. బొగ్గు వినిమయం కోసం పూర్తి యాజమాన్యంలో వుండే అనుబంధ సంస్థ ఏర్పాటు*కు ఎన్ఎస్ఇ బోర్డు అనుమతించింది, ఇది నియంత్రణా సంస్థల అనుమతులు పొందాల్సి వుంటుంది. ఈ ప్రతిపాదిత అనుబంధ సంస్థకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతించినట్టుగా నేషనల్ కోల్ ఎక్స్ఛేంజ్ / భారత్ కోల్ ఎక్స్ఛేంజ్ / ఇండియా కోల్ ఎక్స్ఛేంజ్ అని పేరు పెట్టవచ్చునని బోర్డు తెలపింది. బొగ్గు మంత్రిత్వశాఖ జారీచేసిన ప్రతిపాదిత బొగ్గు నియంత్రణలు, 2025 లకి అనుగుణంగా వుంటుంది. ఈ ప్రతిపాదిత కోల్ ఎక్స్ఛేంజ్ అనుబంధసంస్థ లో *రూ 100 కోట్ల వరకూ మూలధనం పెట్టడానికి ఎన్ఎస్ఇ అనుమతించింది.
https://www.nseindia.com/static/investor-relations/announcements మరిన్ని వివరాలకు
బోర్డు సమావేశం నిర్ణయాల లింకును చూడ వచ్చు.
