Breaking News

స్వయం ఉపాధి కి టిఫిన్ బండి అందచేత…!

విజయవాడ. ఫిబ్రవరి 9 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీ పురం 40 వ డివిజన్ లో తాడిశెట్టి ఆదిలక్ష్మి, భర్త చనిపోయి కుటుంబ పోషణ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీవనోపాధి కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తి పాటి శ్రీధర్ ను సంప్రదించింది. ఆయన ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి టిఫిన్ బండి ఇవ్వాల్సిందిగా ఆదేశించా రు. సోమవారం సుజనా ఫౌండేషన్ ద్వారా టిఫిన్ బండినీ ఆదిలక్ష్మికి అంద చేశారు. ఈసందర్భంగా ఆదిలక్ష్మి ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, డివిజన్ టిడిపి అధ్యక్షులు సుబ్బయ్య, బిజెపి నాయకుడు హుస్సేన్, కూటమి నాయకులు ఏదుపాటి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

పెన్షనర్ల హక్కులకై పోరాటo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *