Breaking News

మేరీ మాత ఉత్సవాల లో ప్రజలకు ఆరోగ్యక రమైన వాతావరణన్నీ అందిస్తున్నాం.

విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫిబ్రవరి 9, 10, 11వ తేదీ ల్లో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలలో పాల్గొనే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకుంటున్నామని, భక్తులకు కొరకు 2000 లీటర్ల కెపాసిటీ గల ఐదు స్టీల్ ట్యాంకర్లలో త్రాగునీరు 50వేల వాటర్ బాటిల్స్, 440 పారిశుద్ధ్య కార్మికుల తో పారిశుధ్య నిర్వహణ, 2 ప్రదేశాలలో 20 తాత్కాలి క మరుగు దొడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఉత్స వాలకు వచ్చే మేరీ మత భక్తులకు విజయవాడ నగర పాలక సంస్థ వారు కల్పించే త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ లో ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులందరూ అప్రమత్తంగాఉంటూ నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారని నీటి టాంకర్లను రోడ్లతో తడుపుతూ కాలుష్యాన్ని తగ్గిస్తున్నామని, నీటి పరీక్షలు నిర్వహించి శుద్ధమైన తాగునీరని అందిస్తున్నామని, ప్రజలకు నిరంతరం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు.

ఉగాది పురస్కారాలకు 2026 దరఖాస్తుల ఆహ్వానం.

భూపతి చంద్ర” స్మారక కథానికల పోటీ, తృతీయ విజేతగా కృష్ణమూర్తి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *