Breaking News

ప్రభుత్వ భూములు సర్వే చేయించాలి: సర్పంచ్‌

కోదాడ ,ఫిబ్రవరి 10(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని. వివిధ రకాల ప్రభుత్వ భూములు. సర్వే చేయించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని. మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సరిత కు గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు.గ్రామ కంఠం అసైన్డ్ మరియు ఇందిర మ్మ ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూమిని. సర్వే చేయించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఎవరికి కేటాయించని మిగిలిన ఇళ్ల స్థలాలను గుర్తించాలని అలాగే కబరస్థాన్ స్థలాన్ని సర్వే చేయించ హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని. భవిష్యత్తులో గ్రామానికి ప్రభుత్వం నిర్మించే వివిధ రకాల భవనాలకు అవసరమైన స్థలాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించి నట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సానుకూలంగా స్పందించి త్వరలో సర్వే చేయిస్తామని. హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ తెలిపారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *