లోక్సభ సెక్రటేరియట్కు కాంగ్రెస్ నోటీసులు – 118 మంది విపక్ష ఎంపీల సంతకాలు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్ను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సెక్రటరీ జనరల్కు అధికారిక నోటీసులు అందజేసింది.ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ సహా పలు విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. సభలో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అధికార పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
