Breaking News

ఈసీ కీలక నిర్ణయం..!

రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు – కారణం ఇదే

నేటి తెలుగు పత్రిక: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా 6వ వార్డు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థి మరణం నేపథ్యంలో ఎన్నిక కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

‘ఇది ఆత్మహత్య కాదు.. రాజకీయ హత్య’ – బీజేపీ సంచలన ఆరోపణ

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహదేవప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే ఈ మరణానికి కారణమని ఆరోపించారు.మక్తల్‌లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ర్యాలీ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఓర్వలేక బీజేపీ అభ్యర్థులను ఫోన్ల ద్వారా బెదిరించారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేకే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

పెన్షనర్ల హక్కులకై పోరాటo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *