Breaking News

బాబోయ్ ఎండలు..!

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు – ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో చలి దాదాపుగా తగ్గిపోయింది. ఉదయం వేళల్లో మాత్రమే స్వల్పంగా చలి అనిపిస్తుండగా, పగటి వేళ ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు రోజుల వాతావరణంపై కీలక అప్డేట్ విడుదల చేసింది.


ఏపీ వెదర్ రిపోర్ట్ (అమరావతి వాతావరణ కేంద్రం)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియర్ స్థాయిలో ఉత్తర, ఈశాన్య గాలులు వీచుతున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు వాతావరణం ఇలా ఉండనుంది👇

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం

  • మంగళవారం, బుధవారం: పొడి వాతావరణం
  • ఒకటి రెండు చోట్ల ఉదయపు పొగమంచు
  • గురువారం: పొడి వాతావరణం

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

  • మంగళవారం, బుధవారం: పొడి వాతావరణం
  • అక్కడక్కడ పొగమంచు
  • గురువారం: పొడి వాతావరణం

రాయలసీమ

  • మంగళవారం, బుధవారం: పొడి వాతావరణం
  • ఒకటి రెండు ప్రాంతాల్లో పొగమంచు
  • గురువారం: పొడి వాతావరణం

🔔 గమనిక:
రాబోయే రెండు రోజుల్లో కోస్తా ఏపీ, యానాం, రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


తెలంగాణ 3 రోజుల వాతావరణ నివేదిక

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం
తెలంగాణలో ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీచుతున్నాయి.

పెన్షనర్ల హక్కులకై పోరాటo
  • రాబోయే 2 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3°C తక్కువగా ఉండే అవకాశం
  • మంగళవారం, బుధవారం, గురువారం
    👉 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగే సూచనలు

ప్రజలకు సూచనలు

  1. మధ్యాహ్నం వేళ ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి
  2. నీరు ఎక్కువగా తాగాలి
  3. చిన్నారులు, వృద్ధులు ఎండకు దూరంగా ఉండటం మంచిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *