నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. అదనపు బలగాలతో బందోబస్త్ను కట్టుదిట్టం చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
